లక్నో: ఉత్తరప్రదేశ్లోని (Uttar Pradesh) బాందా (Banda) జిల్లాలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత బాందా జిల్లాలోని పరాయియాదయీ గ్రామ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన బొలేరో.. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఏడుగురు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
కరెంటు షాక్కు గురైన బాలుడిని దవాఖానకు తీసుకెళ్తుంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలోనే ఐదుగురు చనిపోయారని, మరో ఇద్దరు దవాఖాను తరలిస్తుండగా మృతిచెందారని చెప్పారు. మరొకరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని, అతని పరిస్థితి కూడా విషమంగా ఉందని వెల్లడించారు. ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ఉన్నారని చెప్పారు. ప్రమాదం ధాటికి బొలేరో నుజ్జునుజ్జు అయిందని తెలిపారు.
UP | 6 died and 2 seriously injured after an overspeeding car hit a truck in Banda
An overspeeding car with 8 people in it collided with a truck. 5 people died on the spot. Among the 3 admitted to a Community Heath Centre, one died and rest 2 are in critical condition, they have… pic.twitter.com/LDcVAszLEl
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 29, 2023