బెంగళూరు: కర్ణాటకలోని బెలగావి జిల్లాలో పిండం (Fetuses) అవశేషాలు కలకలం రేపాయి. జిల్లాలోని ముదలగి పట్టణ శివార్లలోని ఓ బస్టాప్లో గుర్తు తెలియని వ్యక్తులు డబ్బాను వదిలి వెళ్లారు. గుర్తించిన స్థానికులు.. దానిని తెరచి చూడగ అందులో ఏడు పిండాల అవశేషాలు బయటపడ్డాయి. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ డబ్బాను స్వాధీనం చేసుకున్నారు.
వాటిని భ్రూణహత్యలుగా నిర్ధారించారు. లింగ నిర్ధారణ చేసిన తర్వాత గర్భస్రావం చేశారని, అవి ఐదు నెలల నిండిన శిశువుల పిండాలని గుర్తించారు. కాగా, ఈ ఘటనపై వైద్యారోగ్యశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. ఆ పిండాలని దవాఖానలో భద్రపరిచామని అధికారులు వెల్లడించారు. వాటిని పరీక్షల నిమిత్తం జిల్లా ఫంక్షనల్ సైన్స్ సెంటర్కు పంపిస్తామన్నారు.