ముంబై: ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు సుమారు 7.94 కేజీల బంగారాన్ని సీజ్(Gold Seized) చేశారు. ఏప్రిల్ 8 నుంచి 10వ తేదీ మధ్య ఈ గోల్డ్ను పట్టుకున్నారు. సీజ్ చేసిన బంగారం ధర సుమారు 4.69 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. బంగారాన్ని వేర్వేరు రూపాల్లో స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. వ్యాక్స్, రోడియం ప్లేట్ వైర్లు, బకల్, వాషర్ షేప్ రింగులు, క్రూడ్ జ్వలరీ రూపంలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు ప్రయాణికుల్ని అరెస్టు చేశారు. అబుదాబి నుంచి బ్యాంగ్కాక్ వెళ్తున్న ఇద్దరు విదేశీయుల్ని ట్రాన్సిట్లో పట్టుకున్నారు. వారి వద్ద 24 క్యారెట్ల గోల్డ్ను వ్యాక్స్ రూపంలో స్వాధీనం చేసుకున్నారు. సుమారు 3.46 కేజీల గోల్డ్ను వాళ్లు అండర్ గార్మెంట్స్లో తీసుకువెళ్తున్నట్లు పసికట్టారు. కొలంబో నుంచి ముంబై వెళ్తున్న మరో విదేశీయుడి నుంచి క్రూడ్ గోల్డ్ జ్వలరీని స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద 307 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు.