న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: పదవీ విరమణ చేయడానికి 65 ఏండ్లు అంత పెద్ద వయసేమీ కాదని, ఒక విధంగా ఇది చాలా తక్కువేనని భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం ఉండదని పేర్కొన్నారు. ఒకసారి జడ్జీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజ్యాంగం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగానే పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు సోమవారం ఓ సదస్సులో మాట్లాడారు. దేశంలోని భిన్న ప్రాంతాలు, సమాజంలో కనిపిస్తున్న వైవిధ్యత న్యాయవ్యవస్థలో కూడా ప్రతిబింబించాలన్న సీజేఐ.. అప్పుడే మరింత సమర్థమంతగా పనిచేయగలమన్నారు.