తిరువనంతపురం : కేరళలో పెను ప్రమాదం తప్పింది. కొచ్చికి 16 నాటికల్ మైళ్లదూరంలో సముద్రంలో ఉన్న ఓ క్రూజ్ షిప్ ఇంజిన్ గదిలో మంటలు చెలరేగాయి. షిప్లో ఉన్న 624 మంది ప్రయాణికులతో పాటు, 85 మంది సిబ్బంది తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని నౌక అధికార వర్గాలు తెలిపాయి.
ఆంద్రోత్ ద్వీపానికి బయలుదేరిన వారంతా అక్కడకు చేరుకున్నారని ఎంవీ కవరత్తి క్రూజ్ షిప్ సంక్షేమ అధికారి పేర్కొన్నారు. కల్పేని ద్వీపానికి వెళ్లాల్సిన ప్రయాణికులను గమ్యస్థానానికి తరలిస్తామని షిప్ సంక్షేమ అధికారి శర్షద్ తెలిపారు. ఎంవీ కవరత్తి కొచ్చి నుంచి కవరత్తికి చేరుకుని ఆండ్రోత్ ద్వీపం నుంచి కల్పేని ద్వీపానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నది.