లక్నో : జోధ్పూర్ నుంచి 1000 కిలోమీటర్లు పైగా ప్రయాణించిన పది ఎద్దులు 600 లీటర్ల నెయ్యితో అయోధ్యకు చేరుకుని పవిత్ర సరయూ నదిలో స్నానం చేశాయి. జోధ్పూర్లోని మహర్షి సందిపని రాం ధర్మ్ గోశాల నుంచి నవంబర్ 27న 108 స్టీల్ పాత్రల్లో 600 లీటర్ల నెయ్యితో అయోధ్యకు బయలుదేరాయి. ఇవి శుక్రవారం తెల్లవారుజామున అయోధ్యకు చేరుకుని మందిర్ ట్రస్ట్కు నెయ్యిని అప్పగించాయి. శ్రీ రామ్లల్లా దర్శన్ పైడల్ శోభా యాత్ర పేరిట ఐదు బండ్లను లాగుతూ ఎద్దులు ఈ యాత్రలో పాల్గొన్నాయి.
ఈ ఎద్దులకు మార్గమధ్యలో విశ్రాంతి కల్పిస్తూ భక్తులతో కలిసి ప్రయాణం సాగించారు. జనవరి 22న నూతన రామాలయం ప్రారంభం కాగానే ఈ నెయ్యిని దీపాలు వెలిగించడం ఇతర పూజా ద్రవ్యాల్లో వినియోగిస్తారు. శివుడి వాహనం నంది కావడంతో పాటు రాముడు కూడా శివ భక్తుడు అయినందున నెయ్యిని తీసుకువచ్చేందుకు ఎద్దులను వాడారు.
శివుడు కూడా రాముడిని ఆరాధించేవాడని పురాణాలు చెబుతున్నాయి. ఆవు నెయ్యి ఎంతో ప్రత్యేకమైనదని, దీనిలో 33 కోట్ల దేవతలు ఉండటంతో ఆవు నెయ్యి ఎంతో ప్రశస్తమని వీహెచ్పీ ప్రతినిధి శరద్ శర్మ చెప్పారు. అయోధ్యకు చేరుకున్న అనంతరం ఎద్దులు, ట్రక్ అయోధ్యలో 15 కిలోమీటర్ల పరిధిలోని పలు ప్రాధాన్యత కలిగిన స్ధలాల చుట్టూ పంచ్ కోసి పరిక్రమ చేపట్టాయి.
Read More :
Bullet train station | దేశంలో తొలి బుల్లెట్ రైలు స్టేషన్ ఇదే.. వీడియో షేర్ చేసిన కేంద్ర మంత్రి