న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లోని జోషీమఠ్లో ఇండ్లు కుంచించుకుపోతున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఆ పట్టణంలో ఓ ఆలయం కూలిపోయింది. అనేక ఇండ్లు కూడా పగుళ్లు పట్టాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. తక్షణమే 600 కుటుంబాలను తరలించాలని ఆదేశించింది. జోషీమఠ్లో జరుగుతున్న పరిణామాలపై స్టడీ చేపట్టాలని కేంద్రం ఓ నిపుణుల ప్యానెల్ను ఏర్పాటు చేసింది. భూమి ఎందుకు కుంచించుకుపోతుందో ఆ ప్యానెల్ అధ్యయనం చేయనున్నది. బిల్డింగ్లు, హైవేలు, ఇతరమౌళిక సదుపాయాలు కూడా ఆ పట్టణంలో నేలకూలుతున్నాయి. దీంతో అక్కడ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవాళ సీఎం పుష్కర్ సింగ్ థామి .. జోషీమఠ్లో పర్యటించనున్నారు. సమస్యను పరిష్కరించేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను తయారు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అవసరం అయితే విమానాల్లో ప్రజల్ని తరలించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
వాతావరణ మార్పులు, నిరంతం డెవలప్మెంట్ పనులు జరగడం వల్లే జోషీమఠ్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడినట్లు భావిస్తున్నారు. బద్రీనాథ్, హేమకుండ్ సాహిబ్కు వెళ్లేందుకు జోషీమఠ్ కీలక మార్గం. ఈ పట్టణం నుంచి ఆ రెండు క్షేత్రాలకు భక్తులు వెళ్తుంటారు. ఇండియా, చైనా బోర్డర్ వద్ద ఉన్న మిలిటరీ బేస్ క్యాంప్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇక ఆసియాలోనే అతిపెద్ద అవులీ రోప్వే కూడా ఇక్కడే ఉంది. ప్రస్తుతం ఆ రోప్వే ప్రాంతంలో క్రాక్లు రావడం వల్ల దాన్ని నిలిపివేశారు. ప్రస్తుతం హీలాండ్-మార్వారి బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను ఆపేశారు.