తిరువనంతపురం: కేరళలో కొండలు, లోయలతో కూడిన ప్రదేశాలు ఎక్కువ. ముఖ్యంగా శబరిమల అయ్యప్పస్వామి సన్నిధికి వెళ్లే దారిలో దాదాపు 40 కిలోమీటర్ల దూరం కొండలు, లోయలతో కూడిన రహదారే ఉంటుంది. ఈ దారిలో వాహనం డ్రైవర్ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం బారినపడాల్సిందే. అందుకే అక్కడ అప్పుడప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా తమిళనాడు నుంచి 60 మంది అయ్యప్ప భక్తులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. పథనంథిట్ట జిల్లాలో బస్సు అదుపు తప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న అయ్యప్ప భక్తులందరికీ గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Kerala | Several feared injured after a bus carrying around 60 Sabrimala pilgrims from Tamil Nadu falls into a deep pit in the Pathanamthitta district pic.twitter.com/4cUEP4ZvUN
— ANI (@ANI) March 28, 2023