న్యూఢిల్లీ: దేశంలోని పక్షి జాతుల్లో క్షీణత కనిపిస్తున్నది. గత 30 ఏండ్లలో అధ్యయనం చేసిన మొత్తం 338 పక్షి జాతులలో 60 శాతం జాతుల సంఖ్య తగ్గిపోయినట్టు తాజా అధ్యయనంలో తేలింది. 30 వేల మంది పక్షి పరిశీలకుల డాటా ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
గత ఏడేండ్లలో మూల్యాంకనం చేసిన 359 పక్షి జాతులలో 40 శాతం (142) క్షీణించాయని ‘భారత్లోని పక్షుల స్థితి’ పేరుతో వెలువరించిన ఈ నివేదిక వెల్లడించింది.