న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో డెంగ్యూ వ్యాధి మరోసారి కలకలం రేపింది. డెంగ్యూ వల్ల సోమవారం ఆరుగురు మరణించారు. దీంతో ఢిల్లీలో డెంగ్యూ మొత్తం కేసుల సంఖ్య 23కు చేరింది. గత ఆరేండ్లలో రికార్డుస్థాయి మరణాల సంఖ్య ఇదేనని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 2016, 2017లో గరిష్ఠంగా 10, 2018లో 4, 2019లో రెండు డెంగ్యూ మరణాలు నమోదైనట్లు ఆ శాఖ అధికారి చెప్పారు. ఈ వారం కొత్తగా 130 డెంగ్యూ కేసులు రికార్డుకెక్కాయని అన్నారు. దీంతో మొత్తం డెంగ్యూ కేసుల సంఖ్య 9,500లు దాటినట్లు వివరించారు. ఒక్క డిసెంబర్ నెలలోనే 25వ తేదీ వరకు 1,269 డెంగ్యూ కేసులు నమోదైనట్లు వెల్లడించారు.
మరోవైపు పెరుగుతున్న డెంగ్యూ కేసులు, మరణాలపై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం స్పందించింది. నగరంలో దోమల వ్యాప్తిని పర్యవేక్షించడానికి, నియంత్రించడానికి టాస్క్ఫోర్స్లను ఏర్పాటు చేయాలని మూడు మున్సిపల్ కార్పొరేషన్లతో సహా స్థానిక సంస్థలను ఆదేశించింది.