న్యూఢిల్లీ, అక్టోబర్ 19: దీపావళి సందర్భంగా పటాకులు కాల్చితే ఆరు నెలల వరకు జైలు శిక్ష పడుతుందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ హెచ్చరించారు.
జైలు శిక్షతోపాటు జరిమానా కూడా పడుతుందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది కూడా పటాకులపై నిషేధం విధించామని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పటాకులను తయారు చేసినా, నిల్వ ఉంచినా, అమ్మినా మూడేండ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తామని హెచ్చరించారు.