ముంబై: మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో మంజార్సంబా-పటోడా హైవైపై కారు, డీసీఎం వ్యాన్ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాద ధాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు.
జివాచివాడికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు ఓ కారులో పుణేలో జరుగుతున్న వివాహ వేడుకకు వెళ్తున్నారని, ఈక్రమంలో వారి కారును ఓ టెంపో ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. రెండు వాహనాలను క్రేన్ సహాయంతో వేరుచేశామని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.