న్యూఢిల్లీ: అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం అర్ధరాత్రి 12.11 గంటల సమయంలో 6.5 తీవ్రతతో భూమి కంపించింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు చోటుచేసుకున్నాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మొలజీ (NCS) వెల్లడించింది. నికోబార్ దీవుల్లో భూకంప కేంద్రం ఉన్నదని పేర్కొంది. సునామీ వచ్చే ప్రమాదం ఏమీ లేదని తెలిపింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు.
మరోవైపు బంగాళా ఖాతంలో కూడా భూమి కంపించందని, దీని తీవ్రత 6.3గా నమోదయిందని ఎన్సీఎస్ తెలిపింది. దీనిప్రభావంతో సముద్ర తీరంలోని దీవుల్లో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని వెల్లడించింది. ఇక ఇండో నేషియాలో కూడా భూకంపం వచ్చింది.
EQ of M: 6.3, On: 29/07/2025 00:11:50 IST, Lat: 6.82 N, Long: 93.37 E, Depth: 10 Km, Location: Bay of Bengal.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/QZdzAeIift— National Center for Seismology (@NCS_Earthquake) July 28, 2025