బెంగళూరు: కనీస బరువు ఉండాలన్న నిబంధన నేపథ్యంలో ఉద్యోగార్థులు ఎత్తులు వేశారు. ఒక వ్యక్తి లోదుస్తుల్లో ఐదు కేజీల బరువున్న రాయిని ఉంచుకున్నాడు. మరికొందరు బరువైన ఇనుప ప్లేట్లను కాళ్ల పై భాగంలో, షర్టు లోపల కట్టుకున్నారు. అయితే ఇలాంటి కుయుక్తులతో మోసగించేందుకు ప్రయత్నించిన ఎనిమిది మంది దొరికిపోయారు. విస్తూపోయే ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది. కల్యాణ కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఇటీవల డ్రైవర్ కమ్ కండక్టర్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన ఇచ్చింది. అభ్యర్థులు కనీసం 55 కేజీల బరువు ఉండాలని నిబంధనలో పేర్కొంది.
కాగా, 1,619 పోస్టులకు 38,000 మంది ఔత్సాహిక ఉద్యోగార్థులు దరఖాస్తు చేశారు. సెలక్షన్ సందర్భంగా కొందరు మోసాలకు పాల్పడ్డారు. 55 కేజీల కంటే తక్కువ బరువున్న వారు ఎత్తులు వేశారు. ఒక వ్యక్తి లోదుస్తుల్లో ఐదు కేజీల బరువున్న రాయిని ఉంచుకున్నాడు. మరికొందరు బరువైన ఇనుప ప్లేట్లను కాళ్ల పై భాగంలో, షర్టు లోపల కట్టుకున్నారు.
మరోవైపు ఇలాంటి కుయుక్తులతో మోసగించేందుకు ప్రయత్నించిన ఎనిమిది మంది అభ్యర్థులు సెలక్షన్ సందర్భంగా అధికారులకు దొరికిపోయారు. దీంతో ఈ న్యూస్తోపాటు దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.