Online fraud | న్యూఢిల్లీ, మే 11: భారత్లో ఏటా చోటుచేసుకొంటున్న ఆర్థిక నేరాల్లో 57 శాతం వివిధ ఆన్లైన్ వేదికల ద్వారానే సాగుతున్నాయని పీడబ్ల్యూసీ ‘గ్లోబల్ ఎకనమిక్ క్రైమ్ అండ్ ఫ్రాడ్ సర్వే-2022’లో తేల్చింది. ఈ కామర్స్, సోషల్మీడియా, ఫైనాన్షియల్ సర్వీసెస్, గూడ్స్, ఎంటర్ప్రైసెస్, మీడియా షేరింగ్, నాలెడ్జ్ షేరింగ్, సర్వీసెస్ వేదికల ద్వారానే అత్యధిక నేరాలు జరుగుతున్నాయని వెల్లడించింది. భారతీయ కంపెనీలకు ఈ నేరాలు పెను సవాలు విసురుతున్నాయని పేర్కొన్నది.