Toefl | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: విదేశాల్లో సెకండరీ విద్య, సర్టిఫికేషన్స్ కోసం టోఫెల్ (టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారిన్ లాంగ్వెజ్) రాస్తున్న భారతీయుల సంఖ్య ఏటా పెరుగుతున్నదని ‘ఈటీఎస్’ (ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్) వెల్లడించింది. టోఫెల్, జీఆర్ఈ పరీక్షలు నిర్వహించే ఈటీఎస్.. యువత ఆకాంక్షల్లో వచ్చిన మార్పులపై ఓ నివేదిక విడుదల చేసింది.
ఉద్యోగం, ఇమ్మిగ్రేషన్ కోసం టోఫెల్ రాసినవాళ్ల సంఖ్య 2021లో 7 శాతం, 2022లో 8 శాతం తగ్గింది. విదేశాల్లో గ్రాడ్యుయేషన్, పీజీ ప్రోగ్రాం కోసం టోఫెల్కు హాజరైన వారి సంఖ్య 70 శాతం నుంచి 71.84శాతానికి పెరిగింది. రాబోయే మూడు నుంచి ఐదేండ్లలో దాదాపు 25 లక్షల మంది భారతీయ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి విద్య కోసం విదేశాల్లో అడుగుపెట్టే అవకాశముందని ‘ఈటీఎస్’ ఇండియా కంట్రీ మేనేజర్ సచిన్ జైన్ అన్నారు.