మోరే: సుమారు 500 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను మణిపూర్లో స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్లో 54 కేజీల బ్రౌన్ షుగర్, 154 కేజీల ఐస్ మెత్లు ఉన్నాయి. మోరే పట్టణంలో అస్సాం రైఫిల్స్ దళాలు ఆ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నాయి. మయన్మార్కు చెందిన మహిళ ఇంట్లో ఆ డ్రగ్స్ను పట్టుకున్నారు. ఆ మహిళ ఓ చైనీయుడిని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని అంశాలు రావాల్సి ఉంది.