భుజ్, మే 26: గుజరాత్లోని కచ్ జిల్లాలో ముంద్రా పోర్టు సమీపంలో రూ.500 కోట్ల విలువైన 56 కేజీల కొకైన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ముంద్రా పోర్టుకు వచ్చిన ఓ కంటైనర్లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సోదాలు నిర్వహించగా కొకైన్ బయటపడింది. ఇటీవల గుజరాత్లోని పోర్టులో పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు ట్టబడుతున్నాయి. గత ఏడాది సెప్టెంబర్లో ఏకంగా 21 వేల కోట్ల విలువైన డ్రగ్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.