UP Assembly Results | ఉత్తరప్రదేశ్లో బలంగా ఉన్న అధికార బీజేపీని ఢీకొట్టేందుకు అఖిలేశ్ యాదవ్ సారధ్యంలోని సమాజ్వాదీ పార్టీ సర్వశక్తులు కూడగట్టుకునా.. ఓటమి పాలైంది. యోగి ఆదిత్యనాథ్ సారధ్యంలో యూపీలో బీజేపీ మరోదఫా ఘన విజయం సాధించింది. మధ్యలోనే సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) సైకిల్కు పంక్షర్ కావడానికి ఐదు కారణాలు ఉన్నాయి. ఇప్పటికీ ప్రధాని నరేంద్రమోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జోడీ బలమైందని మరోమారు రుజువైంది. ప్రపంచంలోకెల్లా ప్రజాదరణ పొందిన నేతల్లో ప్రధాని మోది ఒకరు. ఎన్నికలకు ముందు సర్వేల్లో యోగి ఆదిత్యనాథ్.. యూపీకి ఫేవరెట్ సీఎం అని తేలింది.
ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్.. తన మిత్రపక్షం ఆర్ఎల్డీ అధినేత జయంత్ చౌదరి.. యువనేతలుగా ముందుకొచ్చారు.. యూపీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లామన్నారు. కానీ బీజేపీకి వ్యతిరేకంగా సమర్థవంతంగా పని చేయడంలో యాదవ్-చౌదరి ద్వయం వెనుకబడింది. ఆగ్రహంతో ఉన్న జాట్లు.. యువత నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారని చెబుతూ వచ్చారు. కానీ విజయానికి గల ఏ ఒక్క అవకాశాన్ని బీజేపీ వదులుకోకుండా ముందుకు సాగడంతో మరో దఫా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నది.
యూపీలో రాజకీయాలు కులాల ఆధిపత్యానికి నిదర్శనం అని భారీగా ప్రచారం సాగేది. కానీ 2017లో 39 శాతం ఓటు బ్యాంకు పొందిన బీజేపీ 42 శాతానికి తన ఓటు షేర్ పెంచుకుంది. యూపీలో 25-27 శాతం సాధారణ కులాలు కాగా, 40 శాతం ఓబీసీలు, 20 శాతం ఎస్సీ ఎస్టీలు.. మిగతా 15 శాతం ముస్లింలు. ముస్లింలు ఓటేయకున్నా.. సాధారణ కులాలు మొదలు ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీల నుంచి కమలనాథులు భారీగా ఓట్లు పొందారు. అందువల్లే బీజేపీ ఓటు షేర్ పెరిగింది.
పలు అంశాల్లో బీజేపీని ఇబ్బందులు పెట్టడానికి సమాజ్వాదీ పార్టీ ప్రయత్నించింది. సమాజ్వాదీలు స్పష్టమైన ప్లాన్లను అమలు చేయడంలో విఫలం అయ్యారు. రైతుల నిరసనలు మొదలు ఇంధన ధరలు, నిరుద్యోగం, అధిక ధరలు తదితర సమస్యలు ఉన్నాయి. ఈ అంశాలను లేవనెత్తడంలో ఎస్పీ విఫలమైంది. సమస్యలపై సానుకూలంగా స్పందించడానికి బదులు.. బీజేపీ ప్రకటనలు, పెర్ఫార్మెన్స్ను తక్కువ చేయడం ఎస్పీ చేసిన పొరపాట్లలో ఒకటి.
కొందరు వ్యక్తులతో కూడిన పెద్ద గ్రూప్, ఒక వ్యక్తి మధ్య పోలిక సరి కాదు. అఖిలేశ్ యాదవ్, జయంత్ చౌదరి కొంతకాలం వరకు ప్రజల దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నించారు. కానీ, ఆయా పార్టీలు ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్ల రూపంలోకి మార్చలేకపోయారు. అఖిలేశ్ యాదవ్ యువ నాయకుడైనా, చరిస్మా గల నేత అయినా.. క్రౌడ్ పుల్లర్ అయినా.. ఆయనకు గల జనాకర్షణను అనుకూలంగా మార్చడంలో ఎస్పీ శ్రేణులు విఫలం అయ్యాయి. ఎస్పీకి భిన్నంగా బీజేపీ, దాని మాతృసంస్థ ఆరెస్సెస్ ఎన్నికల విజయ యంత్రంగా పని చేశారు. భారీ సంఖ్యలో సంఘ్ కార్యకర్తలు.. పోలింగ్ తేదీ వరకు బీజేపీ బ్లూ ప్రింట్ను అమలు చేయడంలో అహర్నిశలు కృషి చేశారు.