జైపూర్: లారీని వెనుక నుంచి పోలీస్ వాహనం ఢీకొట్టింది. (Police Vehicle rams truck) ఈ ప్రమాదంలో ఐదుగురు పోలీస్ అధికారులు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. రాజస్థాన్లోని చురు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాజస్థాన్లో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా విధుల కోసం పోలీస్ అధికారులు నాగౌర్ నుంచి ఝుంజునుకు పోలీస్ వాహనంలో బయలుదేరారు.
కాగా, ఆ పోలీస్ వాహనం వేగంగా ప్రయాణించగా ఒక లారీ ఓవర్టేక్ చేసింది. అంతేగాక ఆ లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేశాడు. ఈ నేపథ్యంలో పోలీస్ వాహనం చాలా వేగంగా లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు పోలీస్ అధికారులు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో చనిపోయిన, గాయపడిన పోలీసులు రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాకు చెందినవారని అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.