న్యూఢిల్లీ : హర్యానాలోని ఢిల్లీ – జైపూర్ హైవేపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆది గ్రామ సమీపంలో నిలిపి ఉంచిన ట్రక్కును క్రూయిజర్ ఢీకొట్టింది. దీంతో ఐదుగురు దుర్మరణం చెందగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను బవాల్ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. రాజస్థాన్కు చెందిన మాలు రామ్ అనే వ్యక్తి తన తండ్రి ఆస్థికలను ఉత్తరాఖండ్లోని హరిద్వార్ వద్ద గంగా నదిలో కలిపేందుకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.