గాంధీనగర్: గుజరాత్లోని భరూచ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దహెజ్ పారిశ్రామిక వాడలో ఉన్న ఆర్గానిక్ కెమికల్ ఫ్యాక్టరీలో (Organic Chemical factory) ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత పేలుళ్లు సంభవించాయి. దీంతో ఐదుగురు కార్మికులు అగ్నికి ఆహుతయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. మంటల్లో చిక్కుకున్న వ్యక్తిని కాపాడి దవాఖానకు తరలించారు. అయితే.. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటపై అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు.
గత ఆగస్టులో కూడా ఇదే పారిశ్రామిక వాడలోని మరో రసాయన కంపెనీలో పెలుడు సంభవించింది. దీంతో ఓ కార్మికుడులు దర్మరణం చెందగా, ఇద్దరు గాయపడ్డారు.