అంబాలా: నిండుగా ప్రయాణికులతో ముందు వెళ్తున్న ఓ బస్సును వెనుక నుంచి వచ్చిన మరో బస్సు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. హర్యానాలో అంబాలా-ఢిల్లీ హైవేపై హీలింగ్ టచ్ ఆస్పత్రి వద్ద సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు.
సోమవారం తెల్లవారుజామున ఓ ట్రావెల్స్ బస్సు నిండుగా ప్రయాణికులతో హర్యానాలోని అంబాలా నుంచి ఢిల్లీ వైపు వెళ్తున్నది. అంబాలా-ఢిల్లీ హైవేపై వెళ్తున్న ఈ బస్సును దాని వెనుకే వచ్చిన మరో బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఎనిమిది మంది తీవ్రంగాయపడ్డారు. క్షతగాత్రులన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాం. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించాం అని పోలీసులు తెలిపారు.
వెనుక బస్సు డ్రైవర్ మితిమీరిన వేగంతో రావడమే ప్రమాదానికి కారణమని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అంబాలా సర్కిల్ ఇన్స్పెక్టర్ చెప్పారు. బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామని, అతనిపై కేసు నమోదుచేశామని తెలిపారు.