అమ్రోహ్: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమ్రోహ్లో రెండు బైక్లు ఢీకొన్న ఘటనలో అయిదుగురు మృతిచెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. ఒక మోటర్సైకిల్పై నలుగురు పెద్దలు, ఇద్దరు చిన్నారులు వెళ్తుండగా.. మరో బైక్పై ఇద్దరు ప్రయాణిస్తున్నారు. ఆరుగురితో వెళ్తున్న బైకర్ నియంత్రణ కోల్పోవడం వల్ల మరో బైకర్ను ఢీకొట్టాడు. ఆదంపూర్ ఏరియాలో ఈ ప్రమాదం జరిగింది. పూల్ సింగ్(55), నరేశ్(35), సత్పాల్(22), చావి(5), లవ్కుశ్(6), విజేంద్రలు వెడ్డింగ్ పార్టీకి వెళ్లి ఒకే బైక్పై తిరిగి వస్తున్నారు. అయితే మరో బైక్పై ఉన్న ఆకాశ్(26), కపిల్ను ఢీకొట్టారు. ఈ ఘటనలో అక్కడిక్కడే పూల్ సింగ్, నరేశ్, సత్పాల్, చావి, ఆకాశ్లు మృతిచెందారు. లవ్కుశ్, విజేంద్ర, కపిల్లు గాయపడ్డారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉంది.