లేహ్ : కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్ను వరుస భూకంపాలు వణికించాయి. నిమిషాల తేడాతో రెండుసార్లు భూమి కంపించడంతో జనం భయాందోళనకు గురయ్యారు. మొదట రాత్రి 7.01 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై 5 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. శ్రీనగర్కు 183 కిలోమీటర్ల దూరంలో, భూమికి 137 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
రాత్రి 7.09 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై 4.8 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. రాజౌరికి 214 కిలోమీటర్ల దూరంలో భూపంక కేంద్రం గుర్తించినట్లు ఎన్సీఎస్ పేర్కొంది. నిమిషాల వ్యవధిలో వరుసగా భూకంపాలు సంభవించడంతో జనం భయాందోళనకు గురై ఇండ్ల నుంచి పరుగులు పెట్టారు. భూకంపంతో జమ్మూకశ్మీర్లోని పలు ప్రాంతాల్లోనూ ప్రకంపనలు కనిపించాయి. అయితే, ఇప్పటి వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు పేర్కొన్నారు.