న్యూఢిల్లీ: గుజరాత్ తీరంలో మరోసారి పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. పోర్బందర్కు 350 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో సోమవారం రాత్రి చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో రూ.480 కోట్ల విలువైన డ్రగ్స్తో పాక్ పడవ ఒకటి పట్టుబడిందని అధికారులు వెల్లడించారు. అందులోని ఆరుగురు పాకిస్థానీలను అరెస్ట్ చేశామని చెప్పారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ యాంటీ టెర్రరిజం స్కాడ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సంయుక్తంగా ఈ ఆపరేషన్ను నిర్వహించినట్టు తెలిపారు.ఫిబ్రవరి 26న 3,300 కిలోల డ్రగ్స్తో పోర్బందర్ వద్ద ఐదుగురు విదేశీయులు పట్టుబడిన సంగతి తెలిసిందే.