న్యూఢిల్లీ, మే 26: దేశంలోని 48 శాతం మంది విద్యార్థులు పాఠశాలకు కాలినడకన వెళ్తున్నారు. స్కూల్ బస్సుల్లో 9 శాతం, ప్రజారవాణా వాహనాల్లో 9 శాతం బడికి వెళ్తున్నారు. 8 శాతం మంది విద్యార్థులు సొంత వాహనాలను వినియోగిస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన నేషనల్ అచీవ్మెంట్ సర్వే-2021 నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ నివేదిక ప్రకారం.. 65 శాతం మంది ఉపాధ్యాయులపై ఎక్కువ పనిభారం పడుతున్నట్టు నివేదిక వెల్లడించింది. తాము చేస్తున్న ఉద్యోగంపట్ల సంతృప్తితో ఉన్నట్టు 97 శాతం మంది టీచర్లు చెప్పినట్టు వివరించింది. విద్యార్థుల హోం వర్క్, ఇతరత్రా అంశాలపై వారి తల్లిదండ్రుల నుంచి సరైన సహకారం అందట్లేదని 25 శాతం పాఠశాల యాజమాన్యాలు పేర్కొన్నట్టు తెలిపింది. కేంద్రప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధా నం (ఎన్ఈపీ) చర్చలో కేవలం 58 శాతం మంది టీచర్లు మాత్రమే పాల్గొన్నట్టు వివరించింది.