పుణె, నవంబర్ 20: మహారాష్ట్రలోని పుణెలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. నగరంలోని పుణె-బెంగళూరు రహదారిపై నవ్లే బ్రిడ్జి వద్ద లారీ అతి వేగంతో వాహనాలపై దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 47 వాహనాలు ధ్వంసమయ్యాయి. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పుణె ఫైర్ బ్రిగేడ్, పుణె మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ రెస్క్యూ బృందాలు క్షతగాత్రులను హుటాహుటిన దవాఖానకు తరలించాయి.