న్యూఢిల్లీ, నవంబర్ 10: దేశంలో ప్రతిష్ఠాత్మక ఉన్నత విద్యా సంస్థలుగా ఉన్న ఐఐటీల్లో 2023-24 విద్యా సంవత్సరంలో 45 సీట్లు భర్తీకాకుండా మిగిలిపోయాయి. ఈ విధంగా జరుగడం గత ఐదేండ్లలో ఇది తొలిసారి.
దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో కలిపి ఈ ఏడాది మొత్తంగా 17,385 సీట్లు ఉండగా.. ఏడు విడతలుగా నిర్వహించిన జోసా కౌన్సెలింగ్ ద్వారా 17,340 మందికి సీట్లు కేటాయించారు.