Gujarat | బనస్కంత, ఆగస్టు 20: పాకిస్థాన్కు చెందిన 45 మంది హిందువులను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీసా గడువు ముగిసినా దేశంలో ఉంటున్న వీరిని బనస్కంత జిల్లాలోని అకోలీ గ్రామంలో అదుపులోకి తీసుకొన్నట్టు పోలీసులు ఆదివారం తెలిపారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ సందర్శనకు వచ్చిన పాక్ హిందువులు.. ఆ తర్వాత బంధువులను కలిసేందుకు బనస్కంత వచ్చారని చెప్పారు. వ్యాలిడ్ వీసాపై భారత్లో రెండు నెలలు ఉన్నారని, వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇక్కడే ఉంటున్నారని స్థానిక ఐబీ ఇన్స్పెక్టర్ సంతోశ్ వెల్లడించారు.