న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కరోనా కలకలం సృష్టించింది. కార్యాలయంలో 42 మంది సిబ్బందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో అందరిని ఐసోలేషన్లో ఉండాలని వైద్యులు సూచించారు. కార్యాలయన్ని పూర్తిగా శానిటైజ్ చేశారు.
సెంట్రల్ ఢిల్లీలోని మింటో రోడ్డులో బీజేపీ ప్రధాన కార్యాలయం ఉన్నది. కోర్ గ్రూప్ మీటింగ్ నేపథ్యంలో కార్యాలయంలోని సిబ్బందికి కరోనా పరీక్షలు చేశారు. ఇందులో 42 మందికి పాజిటివ్గా తేలింది. ఇందులో అధికంగా శానిటేషన్ సిబ్బంది ఉన్నారని కార్యాలయ వర్గాలు తెలిపారు. వారిని సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాలని కోరామన్నారు.
పార్టీ ప్రధాన కార్యాలయంలో కరోనా కలకలం సృష్టించడంతో కొత్తగా నిబంధనలు అమలుచేస్తున్నారు. ముఖ్యమైన పని ఉన్నవారు మాత్రమే హెడాఫిస్కు రావాలని నేతలకు కార్యాలయ సిబ్బంది సూచించారు. ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం పార్టీ కోర్కమిటీ మీటింగ్ జరిగిన విషయం తెలిసిందే.
కాగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం కరోనా బారినపడిన విషయం తెలిసిందే. అదేవిధంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కరోనాకు చికిత్స పొందుతున్నారు. ఆయన ఇప్పుడిప్పుడే వైరస్ నుంచి కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. మరో మంత్రి నితిన్ గడ్కరికి పాజిటివ్ వచ్చింది. ఆయన ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నారు.