న్యూఢిల్లీ, ఆగస్టు 9: సెంట్రల్ యూనివర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కేటాయించిన పోస్టుల్లో 42 శాతానికిపైగా ఖాళీగా ఉన్నాయని కేంద్రం తెలిపింది. బుధవారం కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభలో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 7,033 ఉద్యోగాలను కేటాయించగా అందులో 3,007 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. వీటిని భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.