న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. శనివారం నాటికి ఈ సంఖ్య 415కు చేరిందని, 115 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. 108 ఒమిక్రాన్ కేసులతో టాప్లో మహారాష్ట్ర ఉన్నట్లు పేర్కొంది. ఢిల్లీలో 79, గుజరాత్లో 43, తెలంగాణలో 38, కేరళలో 37, తమిళనాడులో 34 కేసుల చొప్పున తర్వాత స్థానాల్లో ఉన్నట్లు వెల్లడించింది. కాగా ఇప్పటి వరకు ఈశాన్య రాష్ట్రాల్లో ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కాలేదు.
మరోవైపు శుక్రవారం నాటికి దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 358 ఉండగా గత 24 గంటల్లో కొత్తగా 57 కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కేసుల వ్యాప్తి తీవ్రత నేపథ్యంలో దేశంలో కరోనా థర్డ్ వేవ్పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నాటికి థర్డ్ వేవ్ తీవ్ర స్థాయికి చేరవచ్చని ఐఐటీ కాన్పూర్ అధ్యయనం అంచనా వేసింది.