Himachal Pradesh | ఈ ఏడాది భారీ వర్షాల (Heavy Rains) కారణంగా ఉత్తరాది రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) అతలాకుతలమైన విషయం తెలిసిందే. వర్షం కారణంగా సంభవించిన వరదలతో ఆ రాష్ట్రం పూర్తిగా దెబ్బతింది. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. సుమారు రూ.10 వేల కోట్లకుపైనే ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారుల అంచనా. అయితే, వర్షం సంబంధిత విపత్తులో రాష్ట్రంలో సుమారు 400 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రి జగత్సింగ్ నేగి (Jagat Singh Negi) తెలిపారు.
జూన్ 24వ తేదీన రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించడంతో కుండపోతగా వర్షాలు కురిశాయి. ఈ విపత్తులో సుమారు 400 మంది మరణించినట్లు మంత్రి తాజాగా వెల్లడించారు. మరో 400 మందికి పైగా గాయపడ్డట్లు చెప్పారు. ఇప్పటి వరకు 2,500 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, 11,000 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని వివరించారు.
Also Read..
La Tomatina | స్పెయిన్లో ఉత్సాహంగా టమాటా ఫెస్టివల్.. వీడియో
Hari Hara Veera Mallu | ఊరమాస్ లుక్లో పవన్ కల్యాణ్.. మతిపోగొట్టేలా హరిహర వీరమల్లు కొత్త సర్ప్రైజ్