న్యూఢిల్లీ: రాబోయే 3 సంవత్సరాలలో 400 కొత్త తరం వందే భారత్ రైళ్లను మెరుగైన సామర్థ్యంతో తీసుకువస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంట్లో మంగళవారం బడ్జెట్ను ఆమె ప్రవేశపెట్టారు. మూడేండ్లలో వంద ప్రధాన మంత్రి గతి శక్తి కార్గో టెర్మినల్స్ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. మెట్రో వ్యవస్థల కోసం వినూత్న మార్గాలను అమలు చేస్తామన్నారు. ఈ సమాంతర మార్గంలో ముందుకు సాగుతూ నాలుగు అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు.
పీఎం గతి శక్తి, సమగ్ర అభివృద్ధి, ఉత్పాదకత పెంపుదల, పెట్టుబడి అవకాశాలు, ఇంధన పరివర్తన-వాతావరణ చర్యలు, పెట్టుబడులకు ఫైనాన్సింగ్ అధిక ప్రాధాన్యత ఇస్తామని సీతారామన్ చెప్పారు. ఈ కేంద్ర బడ్జెట్ రాబోయే 25 సంవత్సరాలలో ‘అమృత్ కల్’పై ఆర్థిక వ్యవస్థకు పునాది వేస్తుందన్నారు. 75 నుండి 100 ఏండ్ల భారత్ అభివృద్ధికి ఇది బ్లూప్రింట్ అని పేర్కొన్నారు.