Ayodhya Ram Mandir | న్యూఢిల్లీ: అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన సోమవారం నాడే దేశవ్యాప్తంగా అనేక మంది తల్లులు బిడ్డలకు జన్మనిచ్చారు. ఆ శుభముహుర్తంలో బిడ్డను కనాలని సిజేరియన్లకు ప్రాధాన్యం ఇచ్చారు. మధ్యప్రదేశ్ ఇండోర్లోని రెండు దవాఖానల్లోనే 15 మంది బిడ్డలకు జన్మనిచ్చారు. 11 మందివి నార్మల్, నలుగురివి సిజేరియన్ డెలివరీలుగా నమోదయ్యాయి.
యూపీలోని ఫిరోజాబాద్కు చెందిన ఓ ముస్లిం మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. అతడికి రామ్రహీమ్గా నామకరణం చేసింది. మహారాష్ట్రలోని థానేకు చెందిన మహిళ తన డెలివరీ డేట్ మంగళవారం కాగా, డాక్టర్లను అభ్యర్థించి సోమవారం మధ్యాహ్నం 12.30కు ప్రసవించింది.