Cop | రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రజలను రక్షించాల్సిన పోలీసే కీచకుడయ్యాడు. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన దౌసా జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
దౌసా (Dausa) జిల్లాకు చెందిన ఓ నాలుగేళ్ల బాలికను స్థానిక ఎస్సై (sub inspector) భూపేంద్ర సింగ్ శుక్రవారం మధ్యాహ్నం తన రూమ్కు తీసుకొచ్చాడు. అక్కడే ఆ చిన్నారిపై అత్యాచారం చేశాడు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్పీ రామచంద్ర సింగ్ తెలిపారు. కాగా, ఘటనపై స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
Also Read..
chandra mohan | టాలీవుడ్లో తీవ్ర విషాదం.. నటుడు చంద్రమోహన్ మృతి
Palvai Sravanthi | మునుగోడులో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ.. పార్టీకి పాల్వాయి స్రవంతి రాజీనామా
BTech | గుడ్న్యూస్.. ఉద్యోగం చేసుకొంటూ..ఇంజినీరింగ్ చదవొచ్చు