శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు ( Encounters ) చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాలు, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా.. రెండు వేర్వేరు బృందాలకు పోంబై, గోపాల్పురా గ్రామాల్లో ఉగ్రవాదులు తారసపడ్డారు. బలగాలను చూసిన ఉగ్రవాదులు వెంటనే కాల్పులకు తెగబడటంతో వారు ఎదురుకాల్పులు జరిపారు.
ఈ రెండు ఎన్కౌంటర్లలో కలిపి మొత్తం నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ వివరాలను కశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్కుమార్ వెల్లడించారు. కాగా, మంగళవారం హైదర్పురాలో జరిగిన ఎన్కౌంటర్లో కూడా ఒక ఉగ్రవాది, అతని సన్నిహితుడు హతమయ్యారు.