Petrol Tanker | మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెట్రోల్ ట్యాంకర్ (Petrol Tanker) బోల్తాపడి నలుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..
మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ముంబై-పూణె ఎక్స్ప్రెస్వేపై (Pune-Mumbai Expressway) ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పెట్రోల్ ట్యాంకర్ లోనావాలకు సమీపంలో ఓవర్ బ్రిడ్జ్ పై ఒక బండరాయిని ఢీ కొనింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా ముంబై-పూణె, పూణె – ముంబైకి రాకపోకలు నిలిచిపోయాయి.
Also Read..
Rahul Gandhi | మరోసారి ట్రక్కు రైడ్ కు వెళ్లిన రాహుల్.. వీడియో వైరల్
Earthquake | ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలను వణికించిన భూకంపం
IndiGo | ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో రన్ వేను తాకిన తోక భాగం