న్యూఢిల్లీ: హర్యానాలోని గురుగ్రామ్లో (Gurugram) ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారిపై వెళ్తున్న కారు, పికప్ వ్యాన్ను (Pickup van) ఆయిల్ ట్యాంకర్ (Oil Tanker) ఢీకొట్టింది. దీంతో ట్యాంకర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో మూడు వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
వేగంగా దూసుకొచ్చిన ట్యాంకర్.. మొదట కారును ఢీకొట్టిందని అంతటితో ఆగకుండా పికప్ వ్యాన్పైకి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. దీంతో వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మరణించారని వెల్లడించారు. ప్రమాదం అనంతరం ట్యాంకర్ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేశామని, ట్యాంకర్ డ్రైవర్ కోసం గాలిస్తున్నామని తెలిపారు.
#WATCH | Haryana: A tanker hits a car and pickup vehicle near Sidhrawali on Delhi-Jaipur Highway. Further details awaited. pic.twitter.com/RhmzpS1PKL
— ANI (@ANI) November 11, 2023