భువనేశ్వర్: ఒడియాలోని నయాగఢ్ జిల్లాలో (Nayagarh) ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బ్రిడ్జిపైనుంచి నదిలో పడిపోయింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆయిల్ ట్యాంకర్.. పారదీప్ నుంచి నయాగఢ్ వెళ్తున్నది. ఈ క్రమంలో నయాగఢ్ జిల్లాలోని ఇటామటి వద్ద ఉన్న పండుసురా వంతెన వద్ద నదిలో పడిపోయింది.
ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో ట్యాంకర్లో ఉన్న నలుగురు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని కటక్ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.