బక్సర్: బీహార్లోని బక్సర్ (Buxar) జిల్లా రఘునాథ్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ (North-East Express) రైలు పట్టాలు తప్పింది. బుధవారం రాత్రి 9.53 గంటలకు రఘునాథ్పూర్ సమీపంలో ఢిల్లీలోని ఆనంద్ విహార్ నుంచి అస్సాంలోని కామాఖ్య జంక్షన్కు వెళ్తున్న నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్లోని 21 బోగీలు పట్టాలు తప్పాయి (Derailed). ఈ దుర్ఘటనలో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో 70 మంది గాయపడ్డారు. దీంతో స్థానికులతోపాటు రైల్వే సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. క్షతగాత్రులను బ్రహ్మపుర్ దవాఖానకు తరలించారు. ప్రమాదం నేపథ్యంలో 21 రైళ్లను అధికారులు దారిమళ్లించారు.
ఘటనా స్థలాన్ని రైల్వే మంత్రి అశ్విని చౌబే (Ashwini Choubey) పరిశీలించారు. తన సొంత నియోజకవర్గంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. యుద్ధప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నదని, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జిల్లా యంత్రాంగం, రైల్వే అధికారులు, స్థానికులు కలిసి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారన్నారు. రెస్క్యూ ఆపరేషన్కు సహకారం అందించిన స్థానికులకు ధన్యవాదాలు తెలిపారు. గాయపడిన వారు దవాఖానలో చికిత్స పొందుతున్నారని, ప్రస్తుతం వారంతా క్షేమంగానే ఉన్నారని చెప్పారు. ట్రాక్ను పునరుద్ధరిస్తున్నామని, వీలైనంత తొందరగా రైల్వే రాకపోకలను సిద్ధం చేస్తామని వెల్లడించారు.
#WATCH | Buxar, Bihar: Union Minister Ashwini Choubey inspects the restoration work and rescue operations after 21 coaches of Kamakhya-Bound North-East Express derailed in Raghunathpur last night pic.twitter.com/clinAm1rDa
— ANI (@ANI) October 12, 2023
#WATCH | Buxar, Bihar: On restoration work of Kamakhya-Bound North-East Express after 21 coaches derailed in Raghunathpur’s Station, Union Minister Ashwini Choubey says, “It is a terrifying scene. I thank the local people for their support in the rescue operation… Thousands of… pic.twitter.com/Ck6JDIRN54
— ANI (@ANI) October 12, 2023