జోధ్పూర్: రాజస్థాన్లోని జోధ్పూర్లో విషాదం చోటుచేసుకున్నది. పెండ్లింట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 60 మంది గాయపడ్డారు. జోధ్పూర్లోని భుంగ్రా గ్రామంలో ఓ ఇంట్లో వివాహ వేడుక జరుగుతున్నది. ఈ క్రమంలో గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంట్లో సిలిండర్ పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. అక్రమంగా అవి ఇళ్లు మొత్తం వ్యాపించడంతో నలుగురు మరణించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. స్థానికుల సహకారంతో గాయపడినవారిని దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారని, వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘనటపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Jodhpur, Rajasthan | Around 60 people injured after a house caught fire during a wedding in Bhungra village
It's a very serious accident. 42 people out of the 60 injured were referred to MGH hospital. Treatment is going on: Himanshu Gupta, District Collector (08.12) pic.twitter.com/9DYKOeHFrE
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) December 9, 2022