Parliament Security Breach | న్యూఢిల్లీ : పార్లమెంట్ లోపల, బయట కలర్ స్మోక్ దాడికి పాల్పడ్డ నలుగురు నిందితులకు ఏడు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సాగర్ శర్మ, మనోరంజన్, నీలం దేవి, అమోల్ షిండేను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని మరింత లోతుగా విచారించనున్నారు.
నిందితులను పోలీసులు గురువారం కోర్టులో ప్రవేశపెట్టారు. రిమాండ్కు తరలించకుండా తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఘటన ఉగ్రదాడిని పోలి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో వారిని మరింత లోతుగా విచారించాలని, వారి వెనుకాల ఏదైనా ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉందా? అన్న కోణంలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని పోలీసులు పేర్కొన్నారు. దీంతో నిందితులకు కోర్టు ఏడు రోజుల పాటు పోలీసు కస్టడీ విధించింది.