పట్నా: బీహార్లోని అరారియా (Araria) జిల్లాలో ఓ జర్నలిస్టు దారుణ హత్యకు (Journalist Murder) గురయ్యాడు. రాణిగంజ్కు (Raniganj) చెందిన విమల్ యాదవ్ (Vimal Yadav) అనే వ్యక్తి దైనిక్ జాగరణ్ (Dainik Jagran) అనే దినపత్రికలో క్రైమ్ రిపోర్టర్గా (Crime Reporter) పనిచేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామన 5.30 గంటల సమయంలో ఆయన ఇంటికి వచ్చిన దుండగులు తలపు తట్టారు. విమల్ డోర్ తెరవగానే.. అతని ఛాతీపై కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల్లో (Accused) నలుగురిని అరెస్టు చేశారు.
మరో నలుగురిని పట్టుకోవాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. రెండేండ్ల క్రితం విమల్ సోదరుడు కూడా ఇదేవిధంగా హత్యకు గురయ్యాడని తెలిపారు. ఈ హత్యలకు పొరుగింటివారితో ఉన్న పాత కక్షలే (Old enmity) కారణమని ప్రాథమికంగా నిర్ధారించామన్నారు. మరో నలుగురు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.