గ్వాలియర్: మధ్యప్రదేశ్ (Madhya Pradesh), ఛత్తీస్గఢ్లో (Chhattisgarh) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం ఉదయం 10.31 గంటలకు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో (Gwalior) భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. గ్వాలియర్కు 28 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నది. ఇక ఛత్తీస్గఢ్లో కూడా భూమి కంపించింది.
An earthquake with a magnitude of 4.0 on the Richter Scale hit 28km SE of Gwalior, Madhya Pradesh today at 10:31 am IST: National Centre for Seismology pic.twitter.com/FvXdeqwrZl
— ANI (@ANI) March 24, 2023
ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్లో 3.9 తీవ్రతతో భూకంపం వచ్చిందని ఎన్సీఎస్ తెలిపింది. అంబికాపూర్లో (Ambikapur) ఆరు సెకన్ల పాటు భూమి కంపించిందని వెల్లడించింది. దీని ప్రభావంతో ప్రజలు ఇండ్ లనుంచి బయటకు పరుగులు తీశారని పేర్కొన్నది. కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.
An earthquake with a magnitude of 3.9 on the Richter Scale hit 12km WSW of Ambikapur, Chhattisgarh today at 10:28 am IST: National Centre for Seismology pic.twitter.com/VbTzzsol2O
— ANI (@ANI) March 24, 2023
మంగళవారం రాత్రి అఫ్గానిస్థాన్లోని హిందూ కుష్ పర్వత శ్రేణుల్లో 6.6 తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రభావంతో ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ, జమ్ముకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లో భూమికంపించింది. పాకిస్థాన్, తుర్కెమినిస్థాన్, కజకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనా, కిర్గిస్థాన్ దేశాల్లోనూ భూకంపం సంభవించింది.