పాట్నా: కరోనా థర్డ్ వేవ్ మొదలైందని బీహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. ఆ రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ కేసు శుక్రవారం నమోదైంది. దీనిపై స్పందించిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘బీహార్లో మొదటి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రంలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అత్యధికంగా పాట్నా, గయాలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ రెండు ప్రదేశాలలో నివసిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో కరోనా కేసులు పెరగడానికి ఇది ఒక కారణం కావచ్చు. రాష్ట్రంలో మూడవ కోవిడ్ వేవ్ ప్రారంభమైంది. దీన్ని ఎదుర్కోవడానికి మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాము. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలను ఆరోగ్య శాఖ అప్గ్రేడ్ చేసింది’ అని మీడియాతో అన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిని అంచనా వేసేందుకు త్వరలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఆంక్షలు విధించే అవకాశాలపై చర్చిస్తామని చెప్పారు. రాష్ట్రంలో జీనోమ్ సీక్వెన్సింగ్ లేబొరేటరీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.