Devendra Fadnavis |మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సారధ్యంలోని ప్రభుత్వం 42మంది మంత్రులతో కొలువు దీరింది. ఆదివారం నాగ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో దేవేంద్ర ఫడ్నవీస్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. బీజేపీ నుంచి కొత్తగా 19 మంది, ఏక్ నాథ్ షిండే సారధ్యంలోని శివసేన నుంచి 11 మంది, అజిత్ పవార్ ఆధ్వర్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నుంచి తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ నెల ఐదో తేదీన సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలుగా ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే..
బీజేపీ నుంచి చంద్రశేఖర్ బవాంకులే, రాధాకృష్ణ విఖే పాటిల్, చంద్రకాంత్ పాటిల్, గిరిష్ మహాజన్, గణేష్ నాయక్, మంగళ్ ప్రభాత్ లోధా, జయ్ కుమార్ రావల్, పంకజ్ ముండే, అతుల్ సేవ్, అశోక్ యూకే, ఆశిష్ షెలార్, శివేంద్ర రాజే భోసలే, జయకుమార్ గోరె, సంజయ్ సావాకరే, నితేష్ రాణే, ఆకాష్ ఫండ్కర్ క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. సహాయ మంత్రులుగా మాధురి మిసాల్, డాక్టర్ పంకజ్ భోయర్, మేఘనా బోర్డికర్ సాకోర్ ప్రమాణ స్వీకారం చేశారు.
నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ- అజిత్ పవార్) నుంచి హసన్ ముశ్రిఫ్, ధనంజయ్ ముండే, దత్తాత్రేయ భార్నే, అదితి తాత్కారే, మాణిక్ రావ్ కొకాటే, నరహరి జీర్వాల్, మాకరాండ్ జాదవ్ పాటిల్, బాబా సాహెబ్ పాటిల్ క్యాబినెట్ మంత్రులుగా, ఇంద్రనిల్ నాయక్ సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు.
శివసేన (ఏక్ నాథ్ షిండే) పార్టీ నుంచి గులాబ్ రావ్ పాటిల్, దాదా భుసే, సంజయ్ రాథోడ్, ఉదయ్ సామంత్, శంభురాజె దేశాయ్, ప్రతాప్ సర్నాయక్, భారత్ గోగావాలే, ప్రకాశ్ అబిత్కార్ క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఆశీష్ జైస్వాల్, యోగేశ్ కదమ్ సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.