రామనాథపురం, అక్టోబర్ 29: 37 మంది భారత మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్ట్ చేసింది. రామేశ్వరం నుంచి 463 బోట్లు సముద్రంలోకి వెళ్లగా, అందులో ఐదు బోట్ల వారు తమ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారన్న ఆరోపణతో 37 మందిని శ్రీలంక నావికా దళం అరెస్ట్ చేసింది. కాగా, మత్స్యకారుల అరెస్టును ఫిషర్మెన్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఇటీవల భారత మత్స్యకారులపై శ్రీలంక అధికారులు దాడులు చేయడం పరిపాటిగా మారిందని, కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.