అబిడ్స్, అక్టోబర్17: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల ప్రజలు స్వచ్ఛందంగా టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, దళితరత్న మాణిక్రావు పేర్కొన్నారు.
సోమవారం మహారాష్ట్రలోని బాయ్కల్లాలో 35 మంది బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మాణిక్రావు మాట్లాడుతూ.. దేశచరిత్రలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని చెప్పారు. దేశప్రజలందరికీ తెలంగాణ తరహా పథకాలు తేవాలన్న గొప్ప సంకల్పంతోనే సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.